హైదరాబాద్: నగరంలోని ట్యాంక్బండ్ వద్ద పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం ఖైరతాబాద్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు వస్తున్న కారు.. ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి