నిజామాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2018, డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఒక్కోటి అమలు చేస్తున్నది. బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే పింఛన్ను డబుల్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అర్హత వయస్సును 57 సంవత్సరాలకు కుదించనున్నారు. ఈ నిబంధనను త్వరలోనే అమల్లోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి స్వయంగా సిరిసిల్లలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ప్రకటించడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా వాసుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఇప్పటికే లక్షలాది మంది అభాగ్యులకు పింఛన్ డబ్బులు ఏకంగా రూ.1000 నుంచి రూ.2016కు చేరడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దివ్యాంగుల పింఛన్లు సైతం రూ.1500 నుంచి రూ.3016కు పెరిగింది. వారంతా సంతోషం వెలిబుచ్చుతున్నారు. మొత్తంగా పింఛన్ను డబుల్ చేయగా… అర్హత వయస్సును భారీగా తగ్గించడంతో ఈసారి అర్హుల జాబి తా మరింతగా పెరిగే ఆస్కారం ఏర్పడింది. 65 నుంచి 57 ఏండ్లకు పింఛన్ అర్హత వయస్సును తగ్గించడంతో ప్రభుత్వ సాయం పొందే వారి సంఖ్య మరింతగా పెరుగనుంది.
వేలాది మందికి ప్రయోజనం…
సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో పింఛన్ అర్హత వయస్సును భారీగా తగ్గించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో సైతం ప్రకటించింది. ఇటు పింఛన్ల పెంపుతోపాటు అర్హత వయస్సును 65 నుంచి 57 ఏండ్లకు కుదించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో చాలా మందికి మరింత ప్రయోజనం చేకూరనుంది. ఓటరు జాబితాను అనుసరించి గ్రామాల వారీగా తీసిన గణాంకాల ప్రకారం కామారెడ్డి జిల్లాలో దాదాపు 20వేల మందికి కొత్తగా పింఛన్లు వచ్చే ఆస్కారం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలో ఈ సంఖ్య సుమారు 25వేల వరకు ఉండొచ్చని గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు చెబుతున్నాయి. వీరంతా 57 ఏండ్లు పూర్తి చేసుకున్న వారే కావడంతో వీరికి రూ.2016 పింఛన్కు అర్హులుగానే గుర్తించబోతున్నారు. ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేస్తే నాటి నుంచి కొత్తగా పింఛన్ పంపిణీ ప్రక్రియ షురూ అవుతుంది. సీఎం కేసీఆర్ తాజా ప్రకటనతో ఆశావహుల్లో ఉత్సాహం కనిపిస్తున్నది. వచ్చే నెల నుంచి 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు అందిస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు సమాయత్తం అవుతున్నారు.
ప్రతి ఇంట్లో పింఛన్ లబ్ధిదారు…
ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు దక్కాలంటే అదో ప్రహసనంగా ఉండే ది. దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది లో కొద్దిమందికి మాత్రమే నామ మాత్రంగా ఇచ్చే రూ.200 పింఛన్ చేతి కి అందేది. అది కూడా దళారులు, మ ధ్యవర్తులకు కమీషన్లు పుచ్చుకోగా చేత కాని వృద్ధులకు చేరేది గగనమే అయ్యే ది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పింఛన్ల పంపిణీని మానవతా హృదయంతో చేపట్టారు. దళారులను నిలువరించడంతోపాటు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికను చేపట్టారు. అర్హత ఉన్న వారందరికీ తొలి విడుత వెయ్యి రూపాయలు పింఛన్ అందించారు. ఆ తర్వాత ముందస్తు అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పడిన ప్రభుత్వంలో రూ.2016 అందిస్తున్నారు. ప్రతి నెలా వృద్ధులకు పింఛన్ పంపిణీతో పా టు భరోసా కోల్పోయిన ఆయా వర్గాలకు సైతం పిం ఛన్ సౌకర్యం కల్పించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బోదకా లు బా ధితులు, చేనేత, గీత, బీడీ కార్మికులకు సైతం పిం ఛ న్లు అందించిన ఘనత కేసీఆర్కే దక్కింది. రాష్ట్ర వ్యా ప్తంగా ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక రకంగా పిం ఛన్ అందుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. దివ్యాంగులకు తొలుత రూ.1500 పింఛన్ అమలు చేయగా ప్రస్తుతం రూ.3016 అందుతున్నది.
ఆశావహుల్లో ఆనందం…
57ఏండ్లు పూర్తి చేసుకుని పింఛన్కు అర్హత కలిగిన వారిలో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తున్నది. త్వరలోనే వీరందరికీ పింఛన్లు అమలు చేయనుండడంతో వారంతా సంబురం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 57 ఏండ్ల వయస్సు నిండిన వారికి పింఛన్ అమలు చేయబోతుండడాన్ని ఆయా వర్గాలు స్వాగతిస్తున్నా యి. పింఛన్ అర్హత వయస్సు కుదింపుతో ఉభయ జిల్లాలో దాదాపు 40 నుంచి 50వేల మందికి కొత్తగా లబ్ధి చేకూరబోతున్నది. ప్రస్తుతం రెండు జిల్లాలో 4లక్షల 5వేల 789 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. వీరికి ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోన్న మొత్తం రూ.85.54 కోట్లుగా ఉంది. కొత్తగా పింఛన్లు మంజూరైతే మొత్తం ఖర్చు మరింత పెరుగనున్నది.