జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కన్నెపల్లి ( లక్ష్మీ) పంప్హౌస్ నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. శనివారం 1, 2, 4, 5, 7, 8, 9, 10, 13, 14, 15 మోటార్ల ద్వారా అన్నారం (సరస్వతీ) బరాజ్కు రెండు టీఎంసీల నీటిని తరలించారు. గోదావరి జలాలు రివర్సింగ్ పద్ధతిలో పంప్హౌస్ నుంచి ఎత్తిపోయడం, గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బరాజ్కు తరలించడంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు.