హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘ఉత్తమ పౌరసదుపాయాలు-అత్యుత్తమ యాజమాన్యం’ సేవలందిస్తున్న రాష్ట్రంలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, అలంపూర్, కోరుట్ల మున్సిపాలిటీలకు కేంద్రం ఇండియన్ స్వచ్ఛత లీగ్ అవార్డు (ఐఎస్ఎల్)లను అందజేసింది.
శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గృహ,పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ పీర్జాదిగూడ మేయర్ వెంకట్రెడ్డి, కమిషనర్ రామకిషన్రావు, అలంపూర్, కోరుట్ల కమిషనర్లు నిత్యానంద్, మహ్మ ద్ అయాజ్లకు ఈ అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రూపామిశ్రా, సీడీఎంఏ సత్యనారాయణ, పట్టణ పరిపాలన శాఖ ప్రాంతీయ డైరెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, సయ్యద్ మసూద్ పాల్గొన్నారు.