నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆటో షో రెండో రోజు సందడిగా కొనసాగుతోంది. ప్రముఖ బ్రాండెడ్ వాహనాలను ప్రదర్శనకు పెట్టడంతో తిలకించేందుకు సందర్శకులు తరలి వస్తున్నారు. వాహనాల కొనుగోలుదారులకు పలు జాతీయ బ్యాంకులు రుణాలు మంజూరు ఏర్పాటు చేశాయి. బ్యాంకులు, మరోవైపు వాహన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టడంతో నగరవాసుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రెండో రోజు ఆటో షో లో కియా, టాటా, హోండా కార్లు ఆకర్షణగా నిలుస్తున్నాయి.