హైదరాబాద్ : ఆటో డ్రైవర్లను ప్రజాసేవకులుగా గుర్తించి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నందున ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ రాష్ర్ట ఆటో కార్మికుల పక్షాన రాష్ర్ట అధ్యక్షుడు వేముల మారయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వినతిపత్రం అందించారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ పథకాలను ఆటో డ్రైవర్లకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లాక్డౌన్ కారణంగా కుటుంబ పోషణ భారంగా మారిందని, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కు ఆర్థిక సాయం కింద నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని కోరారు. కరోనాకు ఆటో డ్రైవర్లు బలయ్యారని, ఆ కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలని కోరారు.