నల్లగొండ : గులాబ్ తుఫాన్ తీవ్రతరం అయి వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన క్యాంపు కార్యాలయం నుంచి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిలను సమీక్షించారు.
లోతట్టు ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వర్షాలతో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండేలా చర్యలు తీసుకునేలా విద్యుత్ శాఖను అలర్ట్ చేయాలని కలెక్టర్లను ఆదేశంచారు. అదే సమయంలో వైద్య ఆరోగ్యశాఖ తో పాటు రెస్క్యూ టీంలను అందుబాటులో ఉంచాలని ఆయన చెప్పారు.