జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
మాగంటి గోపీనాథ్
ఖమ్మం, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అభివృద్ధిలో ఖమ్మం నగరం అన్ని ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచిందని, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కృషితో నగరం సుందరంగా మారిందని హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం నగరంలోని పలు డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలించే కేసీఆర్కు మాత్రమే సాధ్యమన్నారు. ఖమ్మం అభివృద్ధితో ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ పూర్తి స్థానాలు కైవసం చేసుకొని తీరుతుందన్నారు. ఖమ్మం నగర అభివృద్ధి బాధ్యత తనదేనని పువ్వాడ భరోసా ఇవ్వడంతో ప్రజలు స్పందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాజ్కుమార్ పటేల్, బి.దీప్యావిజయ్, సీఎన్.రెడ్డి, సంగీత శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 23 : నగరంలోని 27వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి పాలడుగు పాపారావు విజయాన్ని కాంక్షిస్తూ ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో యువనేత కేటీఆర్ సహకారంతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నగరంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు.