సిడ్నీ : ఆస్ట్రేలియా దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగను ఓ వ్యక్తి కాల్చి చంపి మృతదేహాన్ని 15 ఏండ్లపాటు ఇంట్లోనే ఉంచుకున్నాడు. వాసన రాకుండా ఉండేందుకు సుమారు 70కిపైగా ఎయిర్ ప్రెషనర్లను వినియోగించాడు. 2002 సిడ్నీకి చెందిన బ్రూసెన్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఇంట్లో షేన్ స్నెల్మెన్ అనే దొంగ చోరీ చేసేందుకు వచ్చాడు. గుర్తించిన రాబర్ట్స్ అతడిని కాల్చి చంపి శవాన్ని ఇంట్లో భద్రపరిచాడు.
ఆ తరువాత 2017లో రాబర్ట్స్ మృతి చెందాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రాబర్ట్స్ మృతదేహాన్ని తీసుకెళ్లి దహనం చేశారు. ఇది జరిగిన ఏడాది తరువాత ఎస్టేట్ను శుభ్రం చేసేందుకు వచ్చిన వారు ఇంట్లో స్నెల్మెన్ మృతదేహాన్ని గుర్తించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహం సమీపంలో 70 బాటిళ్లకుపైగా ఎయిర్ ప్రెషనర్స్ను గుర్తించారు. రాబర్ట్స్ చాలా అరుదుగా ఇంటి నుంచి బయటకు వచ్చే వాడని స్థానికులు తెలిపారు. ఇంట్లో 10కిపైగా తుపాకులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.