బెంగళూరు: కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో కరోనా వల్ల 592 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఒకే రోజు ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే ప్రథమం. గడచిన 24 గంటల్లో కొత్తగా 48,791 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజు వ్యవధిలోనే 28,623 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 18,38,885కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,36,641కు పెరిగింది.