ఇస్లామాబాద్: క్రికెట్ లవర్స్కు యాషెస్ను మించిన మజా అందించేది ఇండియా, పాకిస్థాన్ సిరీసే. ఈ దాయాదుల మధ్య క్రికెట్ ఫీల్డ్లో జరిగే యుద్ధానికి ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రభావం క్రికెట్పైనా పడింది. అప్పుడప్పుడూ ఐసీసీ టోర్నీల్లో ఆడటమే తప్ప రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. అయితే చాన్నాళ్లుగా ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్న ఇండోపాక్ క్రికెట్ అభిమానులకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ ఏడాది చివర్లో ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 సిరీస్ జరగనున్నట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ చారిత్రక సిరీస్ కోసం సిద్ధంగా ఉండాలని తమకు ఆదేశాలు వచ్చినట్లు ఆయన చెప్పడం గమనార్హం. ఈ వార్తను అక్కడి మీడియా ప్రముఖంగా చూపించింది. అయితే దీనిపై పీసీబీ, బీసీసీఐ మధ్య చర్చలు మాత్రం ఇంత వరకూ జరగలేదని ఆ అధికారి చెప్పారు. ఒకవేళ ఈ సిరీస్ అనుకున్నట్లుగా జరిగితే ఇండియన్ టీమ్ పాకిస్థాన్కు రావాల్సి ఉంటుందని పీసీబీ వర్గాలు తెలిపాయి. చివరిసారి ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగినప్పుడు పాకిస్థాన్ టీమ్ ఇండియాకు వచ్చింది. చివరిసారి ఈ రెండు దేశాల మధ్య 2012-13లో జరిగింది.