యాదాద్రి, మార్చి15: ఆధ్యాత్మికత ఉట్టిపడే కృష్ణ శిలల కమనీయ రూపాలు, భక్తిభావంతో మైమరపించే దేవతా మూర్తులు, ఆహ్లాదం ఉట్టిపడే ప్రకృతి రమణీయత, భక్త జనకోటికి సౌకర్యాల కల్పనతో, అద్భుత శిల్ప కళాకృతుల కు నిలయంగా పంచరాత్రాగమ శాస్త్రరీతిలో ప్రతి కట్టడం పూర్తి ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా యాదాద్రి పుణ్య క్షేత్రం రూపుదిద్దుకుంటున్నది. ప్రతి మండపంలోనూ, మా ఢవీధులు, గోపురాలు, అడుగడుగునా దేవతామూర్తుల ప్రతిమలను చెక్కారు. ఒక్కో పిల్లర్కు ఒక్కో రూపంలో రా మాయణం, మహాభారతంలోని పలు ఘట్టాలను మ హా ద్భుతంగా చెక్కారు. రేయింబవళ్లు స్థపతిసలహాదారు, ఉప స్థపతులు కష్టించి శిల్పాలకు చక్కటి రూపాలను అద్దారు. ఆలయ ప్రథమ,ద్వితీయ ప్రాకారాల ఫిల్లర్లకు మహావిష్ణు భక్తుడైన ప్రహ్లాదుడి ఘట్టాలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడు. దేవతలకు బద్ధ శత్రువులైన రాక్షస జాతిలో జన్మించి, తన తండ్రికి విరోధియైన శ్రీమహావిష్ణువుని నిత్యం స్మరించడం మింగుడు పడని తం డ్రి హిరణ్యకశిపుడు కుమారుడైన ప్రహ్లాదుడిని అంతమొం దించేందుకు ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతాడు. ఈ ఘట్టాలను భక్తులు కనులారా వీక్షించి తరించేలా యాదాద్రి ఆలయంలో శిల్పులు చెక్కారు. చెరసాలలో ప్రహ్లాదుడిని బంధించడం, ప్రహ్లాదుడిని బంధించమని ఆదేశిస్తున్న హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడిని సముద్రంలో పడేస్తున్న దృ శ్యాలు, లీలాదేవి గర్భవతిగా ఉన్న సమయంలో నారా యణుడి ఉపదేశం, అష్టదిగ్పాలను అధీనంలోకి తీసుకున్న హిరణ్యకశిపుడు, వరం పొందిన హిరణ్యకశిపుడు శ్రీమన్నా రాయణుడి దగ్గరకు వెళ్లి ద్వారాన్ని తోయుట, ప్ర హ్లాదుడిని హింసించడం, ప్రహ్లాదుడి నామకరణంతోపాటు మహాభార తంలో శ్రీకృష్ణుడి గీతోపదేశం వంటి దృశ్యాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి.