ముంబై: కరోనా టీకాలపై మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం తగదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ హితవు పలికారు. అవసరమైన సంఖ్యలో టీకాలను కేంద్రం సరఫరా చేయడం లేదన్న మహారాష్ట్ర ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ రోజు వరకు ఆ రాష్ట్రానికి 1,06,19,190 వ్యాక్సిన్లు సరఫరా చేసినట్లు తెలిపారు. ఇందులో 90,53,523 టీకాలు వినియోగం కాగా 6 శాతం మేర సుమారు ఐదు లక్షలకుపైగా టీకాలు వృథా అయ్యాయని చెప్పారు. మరో 7,43,280 టీకాలు పైప్లైన్లో ఉన్నాయని, దీంతో దాదాపు 23 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వాస్తవ వినియోగానికి అవసరమైన దానికంటే ఎక్కువ వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.