న్యూఢిల్లీ, జూలై 9: రూ. లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని మార్కెట్లు వినియోగించుకోవచ్చని కేంద్రం చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని సంయుక్త కిసాన్ మోర్చా ఎద్దేవా చేసింది. 2020-21 సవరించిన బడ్జెట్లో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి కేవలం రూ.208 కోట్లను కేటాయించారని, తర్వాత 2021-22 బడ్జెట్లో రూ.900 కోట్లు కేటాయించారని తెలిపింది. తమకు మేలు చేస్తున్నట్లు లక్ష కోట్ల రూపాయల నిధిని వాడుకోవచ్చని మభ్యపెడుతున్నదని విమర్శించింది.