అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మండలం శాంతిపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపైఒకరు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.
హైకోర్టు పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ నాయకులు స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్లారు.
ఈ క్రమంలో వైసీపీ శ్రేణులతో వాగ్వాదం జరిగి ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. దాడిలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
అల్లర్ల కారణంగా కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల వారిని చెదగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి