ఖమ్మం : ఖమ్మం నగర మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల ఏడో తేదీన ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో అధికారులు ఇందుకు సంబంధించి ఈ ప్రక్రియను ప్రారంభించారు. మరోవైపు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోనుంది.
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై టీఆర్ఎస్ అధిష్ఠానం ఇద్దరు పరిశీలకులను నియమించింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను పార్టీపరంగా సమన్వయం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
పాలమూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..