జమ్మికుంట, ఆగస్టు 19: దళిత, బహుజనుల భూములు లాక్కున్న ఈటల రాజేందర్ దళిత ద్రోహి అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మండిపడ్డారు. అలాంటి వ్యక్తి దళిత బంధు పథకంపై ఇష్టానుసారంగా మా ట్లాడటం శోచనీయమన్నారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘దళిత, బహుజనులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కోవడమేనా..? నీ ధర్మ మా’ అని ప్రశ్నించారు. సమావేశంలో వరంగల్ డీసీసీబీ చైర్మన్ రవీందర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రావుల శ్రీధర్రెడ్డి, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం పాల్గొన్నారు.