హైదరాబాద్ : నగరంలోని కోఠిలో శనివారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వ్యాను, ఆటోరిక్షా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలప్యాకెట్లు తీసుకువెళ్తున్న వ్యాను చాదర్ఘట్ నుండి సుల్తాన్బజార్ వైపు రాంగ్ రూట్లో వస్తుంది. ఇదే సమయంలో కోఠి నుండి చాదర్ఘట్ వైపు వెళ్తున్న ఆటోరిక్షాను వ్యాను ఢీకొట్టింది. ముత్తూట్ ఫైనాన్స్ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఇస్మాయిల్ ఖాన్తో పాటు ఓ ప్రయాణికుడు సలీం గాయపడ్డారు. వ్యాను రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని సుల్తాన్ బజార్ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వ్యాన్ డ్రైవర్ రాజేశ్ను అదుపులోకి తీసుకున్నారు.