కంటోన్మెంట్/ మారేడ్పల్లి, జూన్ 27: బస్తీ, కాలనీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. నాలుగో వార్డులోని బూసారెడ్డిగూడ, ఎల్ఐసీ కాలనీ, భాస్కర్ రావు గార్డెన్ ప్రాంతాల్లో రూ. 22 లక్షల 50 వేల నిధులతో తాగునీటి పైప్లైన్లను వేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి నూతన పైప్లైన్ను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నామన్నారు. నాయకులు పనస సంతోష్, నర్సింహ, లింగం, తిరుపతి, దుబ్బాక కిషన్రావు, నివేదిత, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ : ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమేనని ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. కంటోన్మెంట్లోని కార్ఖానా మసీద్లో నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరం సర్వమతాలకు ఆవాసమని పేర్కొన్నారు. ప్రభుత్వం ముస్లింలను ఆదుకుంటుందన్నారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నివేదిత ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.