ముంబై : మహారాష్ర్ట బద్లాపూర్లోని నోబెల్ ఇంటర్మీడియట్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ నుంచి నిన్న రాత్రి విషపూరితమైన గ్యాస్ లీక్ అయింది. రాత్రి 10:22 గంటలకు గ్యాస్ లీక్ కావడంతో స్థానికులకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. కొందరికి ఊపిరాడకపోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గంటలోనే గ్యాస్ లీక్ను అరికట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కెమికల్ రియాక్షన్ వల్లే గ్యాస్ లీక్ అయిందని కంపెనీ యాజమాన్యం తెలిపింది.