హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్ బీపాస్ విధానంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. టీఎస్ బీపాస్ విధానం ద్వారా.. 75 చదరపు గజాల వరకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. 600 చదరపు గజాల వరకు 10 మీటర్ల ఎత్తు వరకు తక్షణ భవన అనుమతిని దరఖాస్తుదారుని స్వయం ధృవీకరణ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. 10 మీటర్లకు పైబడి ఎత్తు కలిగిన భవనాలకు 21 రోజుల్లో అనుమతి ఇవ్వడం జరుగుతుంది. 80 శాతానికి పైగా దరఖాస్తులు తక్షణ ఆమోదం పొందుతాయి. ఈ విధానం అమల్లోకి వచ్చిన 100 రోజుల్లో 12 వేల 943 భవనాలకు అనుమతులు జారీ చేయడం జరిగింది.
కేపీహెచ్బీ పాత భవనాల స్థానంలో కొత్త నిర్మాణాల ప్రతిపాదనలపై ఆలోచిస్తామని కేటీఆర్ చెప్పారు. గ్రామకంఠం విషయంలో ఉన్న ఇబ్బందులపై దృష్టి సారిస్తామన్నారు. టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సంబంధించి.. కొత్తగా 200ల పైచిలుకు పోస్టులను మంజూరు చేశాం. ఈ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.