హైదరాబాద్: పంద్రాగస్టును పురస్కరించుకొని కొత్త ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఇంటింటా ఇన్నోవేటర్స్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆశావహులు జూలై 25 నాటికి రెండు నిమిషాల నిడివితో కూడిన వీడియో, ఆవిష్కరణకు సంబంధించిన నాలుగు ఫొటోలు, ఆరు వ్యాఖ్యల్లో 9100678543కు పంపాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి తెలిపారు. జిల్లా నుంచి 5 అత్యుత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేసి ఆగస్టు 15న ఆన్లైన్లో ప్రదర్శించనున్నారు. అలాగే ఆవిష్కర్తల పేరు, వయస్సు, ప్రస్తుత వృత్తి, మొబైల్ నంబర్, మండలం, గ్రామం, జిల్లాతో కూడిన వివరాలను 910067 8543కు వాట్సాప్లో పంపాలని అధికారులు సూచించారు. ఇతర వివరాలకు జిల్లా సైన్స్ అధికారి 8309468801ని సంప్రదించాలన్నారు.
అదేవిధంగా ఇంటింటా ఇన్నోవేటర్స్ మూడో విడుత కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆశావహుల నుంచి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఎంపికైన వాటిని ఆన్లైన్లో ప్రదర్శించనున్నారు. ప్రతి జిల్లా నుంచి అత్యుత్తమమైన ఐదు ఆలోచనలను ఎంపికచేసి ప్రదర్శిస్తారు.