న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో గత 20 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం లేదు. ఆయిల్ కంపెనీలు ధరలు పెంచకుండా ప్రభుత్వం చూసుకుంటోంది. అయితే దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ధరల పెంపును నిలిపివేయడం వల్ల పెట్రోల్పై లీటర్కు రూ.4, డీజిల్పై రూ.2 నష్టపోతున్నట్లు ఆ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజైన మరుసటి రోజే అంటే ఫిబ్రవరి 27 నుంచి ధరల పెరుగుదలను కంపెనీలు నిలిపేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ధర 64.68 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడది 68.42 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో రూపాయి విలువ కూడా పడిపోయింది. దీని కారణంగా తాము నష్టపోతున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.