అమరావతి : ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరంలో ఈ ఘటన జరిగింది.
నగరంలోని మధురవాడకు చెందిన కిరణ్ కుమార్కు గత మూడురోజుల క్రితం కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో కేజీహెచ్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండి సీఎస్ఆర్ బ్లాక్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు కిరణ్ కుమార్ ఎస్ బ్యాంకులో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది.
కొవిడ్ సోకిందన్న భయంతో మానసిక వేదనకులోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.