హైదరాబాద్ : ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో అందరూ మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం ఎంతముఖ్యమో తెలిసిందే. ఈ విషయాన్నే టాలీవుడ్ నటుడు సుధీర్బాబు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రాంలో ఓ ఫోటోను షేర్ చేశారు. మాస్క్ ఈజ్ మై సూపర్ హీరో కాస్టూమ్ అని పేర్కొన్నాడు. నా మాస్క్ నా సూపర్ హీరో అంటూ క్యాప్షన్ను జోడించాడు. మాస్క్ ధరించండి.. వ్యాక్సిన్ వేసుకోండని పేర్కొన్నాడు.
సుధీర్బాబు నటించిన తదుపరి చిత్రం కరుణ కుమార్ దర్శకత్వం వహించిన “శ్రీ దేవి సోడా సెంటర్”. ఈ చిత్రంలో నటి ఆనందీ కూడా నటిస్తోంది. గత సంవత్సరం సుధీర్ బాబు హీరో నాని నటించిన “వి” లో కనిపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలో విడుదలైంది. యాక్షన్ పోలీస్గా రూపొందిన ఈ చిత్రం మిశ్రమ స్పందన అందుకుంది.