ఆనారోగ్యంతో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మృతి
పలువురి సంతాపం
పెద్దవూర, ఏప్రిల్ 3: సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, పెద్దవూర సర్పంచ్ కర్నాటి విజయ భాస్కర్రెడ్డి అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. 12 మంది వార్డు సభ్యుల మద్దతుతో టీఆర్ఎస్ తరఫున సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. భాస్కర్రెడ్డి గతంలో పలు ప్రముఖ దినపత్రికల్లో విలేకరిగా పనిచేశారు. విజయ్ భాస్కర్రెడ్డి మృతి పట్ల మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
టీఆర్ఎస్తోనే సాగర్ అభివృద్ధి
రాజ్యసభ సెక్రటరీ జనరల్కు ‘వృక్ష వేదం’