ఆదిలాబాద్ : పెర్సపేన్ దేవతకు ఆదివాసీ గిరిజనులు నిర్వహించే ప్రత్యేక పూజలు గురువారంతో ముగిశాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం చింతకర గ్రామంలోని మల్కుగూడలో కుడిమేత వంశీయులు పెర్సపేన్కు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దేవత విగ్రహాన్ని సంప్రదాయం ప్రకారం ఇప్పపువ్వు చెట్టుకు తరలించారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
అదే విధంగా గాదిగూడ మండలం ఝరి గ్రామంలో పెర్సపేన్కునాగ్బిడ్ మెస్రం వంశస్తులు పూజలు చేశారు. కటోడా మెస్రం నాగోరావ్ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో రెండు రోజుల్లోనే పూజలు ముగించామని తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని వేడుకున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి
ఆకతాయిలను ఐసోలేషన్కు పంపించిన పోలీసులు
అడవి శ్రీరాంపూర్లో కరోనాతో భార్యాభర్తలు మృతి
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
లాక్ డౌన్ కేసులు 11,746 : ఎస్పీ వెంకటేశ్వర్లు
మేడారం పూజారి మృతిపట్ల మంత్రి సత్యవతి సంతాపం