వరంగల్ రూరల్/జనగామ : ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేసే టీచర్లు, సిబ్బందికి కరోనా కష్ట కాలంలో రూ.2,000 ఆర్థిక సహాయం, 25 కిలోల సన్న బియ్యం ఇస్తుండటం పట్ల ప్రైవేట్ టీచర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆపత్కాలంలో ఆదుకున్న సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ తమ కృతజ్ఞతను చాటుకుంటున్నారు.
వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ప్రైవేటు ఉపాధ్యాయులు పాలాభిషేకం చేశారు.
అలాగే టీపీటీఎఫ్ జనగామ జిల్లా కమిటీ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చిత్ర పటానికి పూలాభిషేకం చేశారు.