జయశంకర్ భూపాలపల్లి : ప్రైవేట్ టీచర్లకు ప్రతి నెల ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, నెలకు 2,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నందుకుగాను ప్రైవేట్ టీచర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తవముతున్నాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సీఎం కేసీఆర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చిత్ర పటానికి ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కరోనా కష్టకాలంలో వేలాది ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఎన్నో కుటుంబాలు సతోషంగా ఉన్నాయన్నారు.
ఇవి కూడా చదవండి..
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి
గుడ్న్యూస్.. రేపే కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు!