సిద్దిపేట, జనవరి 8 : రైతుల సంక్షేమాన్ని కాం క్షించి, దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకం తెచ్చి, అన్నదాతలకు పెట్టుబడి సాయం అం దించి, రైతులకు నిజమైన ఆత్మబంధువుగా సీఎం కేసీఆర్ మారారని మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యా ర్డులో ఏఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాంతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ఏడేండ్లుగా ఎన్ని అవాంతరాలు వచ్చినా, రైతుల కోసం నిరంతరాయంగా రైతుబంధును విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి కొనియాడారు. నిత్యం రైతు సంక్షేమ పథకాలతో రైతుల పక్షపాతిగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. రైతుకుఅండగా ఉండాలనే గొప్ప ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబంధును ఇస్తున్నరని తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది విడతలుగా రూ.50వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమా చేశారన్నారు. రైతులకు సాగునీటి అందిచడంతో పాటు పెట్టుబడికి డబ్బులు ఇస్తున్న ఎకైక ప్రభు త్వం టీఆర్ఎస్ సర్కారు అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులతో రాష్ట్రం అన్నపూర్ణగా మారిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. అన్ని రంగాల్లో సమూల మార్పులు చేసి, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. ఉద్యోగుల కేటాయింపు అనంతరం ప్రతి ఖాళీని భర్తీ చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, ఈ విషయాన్ని నిరుద్యోగులు అర్థం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజులారాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, కౌన్సిలర్లు సులోచనాశ్రీనివాస్రెడ్డి, నాయిని చంద్రం, నాయకులు పోచబోయిన శ్రీహరియాదవ్, తిరుమల్రెడ్డితో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం రైతులు సంబురాల్లో భాగంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఫ్లెక్సీలకు వరి ధాన్యం, పాలతో అభిషేకం చేశారు.
కార్యకర్తలను కాపాడుకుంటాం
టీఆర్ఎస్ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతీ కార్యకర్తకు ఇన్సురెన్స్ సదుపాయాన్ని పార్టీ కల్పించిందని, కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుదని మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ఇటీవల చనిపోయిన ఐదుగురు కార్యకర్తల కుటుంబాల కుటుంబ సభ్యులకు రూ.10లక్షల బీమా చెక్కులను మంత్రి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యకర్తలను కంటి రెప్పలా కపాడుకుంటామన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో చనిపోయిన ఐదుగురికి ఒక్కోక్కరికి రూ.లక్షల చొప్పున, కొత్తగా మరో ఐదుగురికి బీమా డబ్బులు మంజూరయ్యాయని తెలిపారు. చెక్కులను మృతుల కుటుంబీలకు అందజేశారు. ఇప్పటి వరకు నియోజక వర్గంలో 25 మంది కార్యకర్తలకు బీమా చెక్కులను అందించమన్నారు.