ఆదిలాబాద్ : సాహిత్య సామ్రాట్ అన్నా భావు సాటే సేవలు చిరస్మరణీయమని జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. అన్న భావు సాటే 101వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో భావు సాటే విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకోసం పోరాడిన గొప్ప భావు సాటే అన్నారు. సమాజం కోసం ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేశారు. దేశ ప్రజల కోసం తన సాహిత్యంతో ప్రజలను జాగృతం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆ మహనీయుడి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
అనంతదరం ఇటీవల మృతి చెందిన డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే సేవలను కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, టీఆర్ఎస్ నాయకులు యునిస్ అక్బన, మరసుకొల తిరుపతి, నర్సింగ్ మోరే ,మహేందర్ దుర్గే, శైలేందర్ వాగ్మారే, బాలాజీ కాంబ్లే , సామాజిక కార్యకర్త బండారి దేవన్న, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి
వెలుగులోకి మరో పోర్న్ రాకెట్ ..కటకటాల వెనక్కి వర్ధమాన నటి
Tokyo Olympics: ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా స్విమ్మర్