హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): అఖిలభారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఏఐఎఫ్టీవో) జాతీయ ఉపాధ్యక్షుడిగా మారెడ్డి అంజిరెడ్డి, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా పద్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆదివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో వీరు ఎన్నికైనట్టు పేర్కొన్నారు.