హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): అంజనాద్రి పర్వతాన్ని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపా రు. తిరుమలకు ఉత్తరంగా జాపాలి తీర్థంలోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ ఇటీవల ప్రకటించింది. దీనిపై రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీందర్కుమార్ అడిగిన ప్రశ్న కు మంత్రి సమాధానమిచ్చారు.
విశాఖ స్టీల్ప్లాంట్ను 100 శాతం ప్రైవేటీకరిస్తామని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీందర్కుమార్ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి భగవత్ కిషన్రావు కరాడ్ జవాబిచ్చారు.