తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్ర్తోక్తంగా జరిగింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారి ఆలయ అధికారులు శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిరుజల్లుల నడుమ పుష్పపల్లకీ సేవ సాగింది.
-తిరుమల, నమస్తే తెలంగాణ