వేల్పూర్, జూన్ 29 : ‘పసుపు బోర్డు ఏ మైంది.. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ ని నెరవేర్చాలని రైతులు అడిగితే గుండాలతో దాడులు చేయిస్తావా’ అని ఎంపీ అర్వింద్ తీరుపై డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల్పూర్ మార్కెట్ కమిటీలో చైర్మన్ కొట్టాల చిన్నరెడ్డి, సొసైటీ చైర్మన్లు రాజేశ్వర్రెడ్డి, మోహన్రెడ్డి, యాళ్ల హన్మంతుతో కలిసి ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఎంపీగా గెలిచిన ఐదు రోజుల వ్యవధిలోనే బోర్డు ఏర్పాటు చేయిస్తానని రైతులను మోసం చేసి ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాడన్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం బోర్డును ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. గుండాలను పెట్టి రైతులపై దాడులు చేయిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు.
కొంతకాలంగా ఈ ప్రాంత రైతులు పసుసు పంట పండిస్తూ ధర లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంత్రి ప్రశాంత్రెడ్డిపై వ్యక్తిగతంగా విమర్శించే హక్కు ఎంపీకి లేదన్నా రు. బాల్కొండ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు జ రుగుతున్నాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఎంపీ మాట్లాడిన మాటలకు పొంతనలేదన్నారు. అభివృద్ధి పనులపై వేల్పూర్లోని గాంధీ విగ్రహం వద్దకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాళ్లరాంపూర్ సొసైటీలో జరిగిన అవినీతిపై మంత్రి గతంలోనే జిల్లా సహకార సంఘం అధికారులకు ఆదేశాలు చేశారన్నారు. అవినీతిపై విచారణ జరిపి ఖాతాదారులకు న్యాయం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారన్నారు. సొసైటీలో జరిగిన అవినితిలో మంత్రికి సం బంధం ఉందని ఆరోపించడం సరైందికాదన్నారు.
రాజకీయంగా ఎదగడానికి స్థాయికి మించి ఎంపీ ఆరోపణలు చేస్తున్నాడని దు య్యబట్టారు. దమ్ముంటే మం త్రితో అభివృద్ధిలో పోటీ పడాలని హితవు పలికారు. సమావేశంలో ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రా ములు, రైతు సమన్వయ సమితి జిల్లా స భ్యుడు మిట్టాపల్లి మహిపాల్, సొసైటీ డైరక్టర్ భోజన్న యాదవ్, కుమ్మరి రాజన్న, సుంకరి రాము తదితరలు పాల్గొన్నారు.