హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా హైదరాబాద్లోని బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ గురువారం రెండు మొక్కలు నాటారు. అనంతరం నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, ఉమెన్ సేఫ్టీవింగ్ అడిషనల్ డీజీ స్వాతిలక్రా, ఆఫ్ఘనిస్థాన్ కాన్సులర్ జనరల్ మహ్మద్ సులేమాన్ కాకర్ను గ్రీన్ ఇండియా చాలెంజ్కు నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు.