మహబూబ్నగర్, జూన్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలో వెయ్యేళ్ల నాటి శిల్పాలను పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ సీఈవో, బుద్ధవనం ప్రాజెక్టు కన్సల్టెంట్ డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. గ్రామంలో ఎప్పటి నుంచో పూజలు అందుకొంటున్న కల్యాణ చాళుక్యుల కాలం నాటి నాగదేవతలు, నంది, వీరుల శిల్పాలు, రోడ్డు విస్తరణలో భాగంగా కనిపించకుండాపోయే ప్రమాదం ఉన్నదన్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ శిల్పాలతోపాటు ఆయుర్వేద మందులు నూరుకొనే సాన రాయి, గుండ్రని కల్వం కూడా ఉన్నట్టు తెలిపారు. చెరువు కట్టపైనున్న భైరవ, భైరవి, వీరభద్ర, సూర్య విగ్రహాలను కూడా పరిరక్షించాలని కోరారు.