ధరూరు, జూలై 11: జోగులాంబ గద్వాల జిల్లా భీంపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తికి చెందిన పాత ఇంటిని కూల్చుతుండగా పురాతన ఉక్కు పెట్టె బయటపడింది. బంగారు దుకాణంలో ఉండే బాక్సు మాదిరి ఉన్నదని, రెండు క్వింటాళ్ల బరువు ఉండొచ్చని స్థానికులు తెలిపారు. ఈ పెట్టెను గ్రామంలోని కమ్యూనిటీ హాలులో భద్రపరిచారు. సోమవారం ఉన్నతాధికారుల సమక్షంలో పెట్టెను తెరవనున్నట్టు ఎస్సై రాములు తెలిపారు.