ఊట్కూర్, మే 19 : కరోనాను కట్టడి చేసేందుకు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించి ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం పదే పదే సూచిస్తున్నది. అయినా జనం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా స్వీయ రక్షణకు పలువురు చర్యలు చేపట్టడం లేదు. బుధవారం మం డలంలో మినీ లారీలో 30 మంది వరకు ప్రయాణించారు. ఇది వారి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఇలాగైతే కరోనా మహమ్మారిని కట్టడి చేసేదెలాగని పలువురు వ్యాఖ్యానించారు.