నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
పాకాల, రంగాయ ప్రాజెక్టు వద్ద రెండో మోటర్ ట్రయల్ రన్ ప్రారంభం
నర్సంపేట, మార్చి 29 : రైతుల పంటలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం పాకాల, రంగా య ప్రాజెక్టులకు చెందిన రెండో మోటర్ ట్రయల్ రన్ను రామప్ప వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే పెద్ది మాట్లాడుతూ గోదావరి జలాలను నర్సంపేట నియోజకవర్గానికి రప్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సంపేట ప్రాం తంలో రైతులు సాగునీటి కోసం పడుతున్న గోసను ప్రత్యక్షంగా చూశారన్నా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించారని తెలిపారు. ఎంతో కాలంగా రైతుల భూములకు సాగునీరందక పంటలు ఎండిపోయాయన్నారు.
గోదావరి జలాలను నర్సంపేటకు రప్పించేందుకు గత పాలకులు ఎన్నో హామీలు ఇచ్చినా నెరవేర్చలేక పోయారన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రెండు పంటలకు సమృద్ధిగా సాగు నీరు అందిస్తామన్నారు. గోదావరి జలాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పాకాల-రామప్ప ప్రాజెక్టు మొదటి మోటర్ ట్రయల్ రన్ ఇప్పటికే విజయవంతమైందని అన్నా రు. రెండో మోటర్తో దబ్బవాగు నుంచి పాకాలకు నీరందిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రామప్ప పంపుహౌస్ వద్ద పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రాజెక్టులో మిగిలిన పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు ఉద్యోగుల సన్మానం
నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్ది సుదర్శన్రెడ్డిని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేశారన్నారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సీఎం అండగా ఉంటున్నారన్నారు. ఉద్యోగులను కాపాడుకోవడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. అనంతరం టీఎన్జీవోస్ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు గజ్జల రామకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించడం ఎంతో సంతోషకరమన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా సహఅధ్యక్షుడు హేమానాయక్, కోశాధికారి సదానందం, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, వెంకటేశ్వర్లు, గంధం లక్ష్మణ్, పవన్కుమార్, శ్రీనివాస్, కృష్ణప్రసాద్, సత్యనారాయణ, దాసరి శంకర్, శ్రీనివాస్, స్వామి, మధు తదితరులు పాల్గొన్నారు.