నల్లగొండ : AMRSLBC పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ నుంచి D39, D40 కాలువలకు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సాగు నీటిని విడుదల చేశారు. పానగల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి హారతిని ఇచ్చారు. అనంతరం తూము గేట్లు ఎత్తి నీటిని కాల్వలోకి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రైతుల కన్నీరు తుడుచారని అన్నారు.
రైతుల కోసం రైతు బీమా, రైతు బంధు, లాంటి పథకాలే కాకుండా రైతు వేదిక లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పంట సమాచారం అందుబాటులో ఉండేటట్టు చేశారని చెప్పారు. 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు అందిస్తున్నారని, రైతులు పండించిన ధాన్యాన్ని, ఎక్కడికక్కడ స్థానికంగా కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. చిన్న చెక్ డ్యాముల నుంచి మొదలుకొని కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులకు పూర్తి చేసి నీటిని నిల్వచేసి భూగర్భ జలాలను పైకి రప్పించారని అన్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా నీటిని చెరువులు నింపుకొని పొదుపుగా వాడుకోవాలని రైతులను కోరారు. కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు, తిప్పర్తి వైస్ ఎంపీపీ వెంకట్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి సీనియర్ నాయకులు కటకం సత్తయ్య గౌడ్ , తిప్పర్తి టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు ముత్తినేని శ్యాంసుందర్ గాదె రామ్ రెడ్డి సంకు ధనలక్ష్మి, టిఆర్ఎస్ కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు, కందుల లక్ష్మయ్య, మాజీ జెడ్పిటిసి పాలకూరి యాదయ్య, జలంధర్ రెడ్డి,బొంగరాల నాగయ్య, తదితరులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
నిజామాబాద్ జిల్లాలో దారుణం..నీటిగుంతలో రెండు మృత దేహాలు
20 మిలియన్ల అభిమానాన్ని పొందిన రష్మిక
Space Wedding : అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
OBC Bill: కోటాపై సీలింగ్ను ఎత్తివేయండి : అధిర్ రంజన్ చౌదరీ