తెలుగు చిత్రసీమలో కథానాయికగా అలరించడంతో పాటు ప్రత్యేక గీతాలతో యువతరంలో మంచి ఫాలోయింగ్కు సంపాదించుకుంది రాయ్లక్ష్మీ. దక్షిణాదిలో మంచి అవకాశాలతో దూసుకుపోతున్న ఈ సొగసరి తెలుగులో బాలకృష్ణతో జోడీ కట్టబోతున్నది. వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా అనంతరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రం చేయబోతున్నారు. ఇందులో రాయ్లక్ష్మీని కథానాయికగా ఎంచుకున్నట్లు తెలిసింది. పోలీస్నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని, కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఇద్దరు కథానాయికలు నటించే ఈ సినిమాలో ప్రధాన నాయిక పాత్రకోసం శృతిహాసన్ను తీసుకోబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాయ్లక్ష్మీ తెలుగులో ‘ఆనందభైరవి’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.