హైదరాబాద్, జనవరి26 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముంద్రించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీ కవితకు కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎమ్మెల్సీ కవితను గురువారం సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జెరిపోతుల పరశురామ్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కరెన్సీపై అంబేదర్ ఫొటో ముద్రించాలనే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసే దిశగా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ న్యాయబద్ధమైన డిమాండ్ సాధనకు సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.