హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాస్ ఐఐటీ 1993 బ్యాచ్ విద్యార్థులు 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు విరాళంగా అందజేశారు. బ్యాచ్ ప్రతినిధి సురేశ్బాబు, ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా రూ.1.5 కోట్ల విలువైన కాన్సన్ట్రేటర్లను సీఎస్ సోమేశ్కుమార్కు బీఆర్కేఆర్ భవన్లో సోమవారం అందించారు. ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా కూడా మద్రాస్ ఐఐటీ 1993 బ్యాచ విద్యార్థియే. ఈ పూర్వ విద్యార్థులకు సీఎస్ అభినందనలు తెలిపారు.