హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ పరిశోధనల్లో కొత్త ఒరవడి అవసరమని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం (ఏఎన్జీఆర్ఏయూ)వీసీ డాక్టర్ ఏ విష్ణవర్ధన్రెడ్డి చెప్పారు. గురువారం ఏపీ గుంటూరులోని వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కా ర్యాలయంలో ఏఎన్జీఆర్ఏయూ, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ)-ఏపీ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. వ్యవసాయ రంగం లో స్మార్ట్ ఫార్మింగ్పై పరిశోధనలకు ఈ ఒప్పందం దోహదపడనున్నది.
స్మార్ట్ ఫార్మింగ్లో డ్రోన్ల వినియోగం, సాగుకు సంబంధించిన వివిధ అప్లికేషన్లలో రోబోల అవసరం ఉన్నదని వర్సిటీ వీసీ డాక్టర్ ఏ విష్ణవర్ధన్రెడ్డి చెప్పారు. ఈ తరహా పరిశోధనలతో రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. రైతులకు ఎన్జీ రంగా వర్సిటీ చేస్తున్న సేవలను వీఐటీ వీసీ డాక్టర్ ఎస్వీ కోటారెడ్డి కొనియాడారు. వ్యవసాయ రంగంలోని పరిశోధనాత్మక పత్రాలు, పేటెంట్ల వివరాలను డాక్టర్ సు మతి తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్, డాక్టర్ టీ గిరిధర కృష్ణ, విభాగాల డీన్లు పాల్గొన్నారు.