హైదరాబాద్: సీఎం దళిత సాధికారతపై నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 11.30 గంటలకు ప్రగతిభవన్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయనున్న ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్’ పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించారు. వారితోపాటు ఎంఐఎం, కాంగ్రెస్, బీజెపీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు. సీపీఐ, సీపీఎం నుంచి సీనియర్ దళిత నేతలను ఆహ్వానించారు. మొత్తంగా ఈ సమావేశానికి 32 మందిని ఆహ్వానించారు.