మంచిర్యాల : జిల్లాలో యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో కొంత మేర కొనుగోళ్లు చేసే విధంగా అవకాశం కల్పించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు. హైదరాబాద్లో మంత్రిని ఎమ్మెల్యే కలిసి జిల్లాలో యాసంగిలో సాగు, దిగుబడి, కొనుగోలు కేంద్రాలపై చర్చించారు.
రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో 2020-21 యాసంగిలో ధాన్యం కొనుగోలు ఏప్రిల్16న ప్రారంభించినట్లు, 244 కేంద్రాలలో కొనుగోలు సాగుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇప్పటి వరకు 18,552 మంది రైతుల వద్ద 1,41,523 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నట్లు వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా ధాన్యాన్ని పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు కొంతమేర కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
షాపు తెరిచినందుకు రూ.3 వేల జరిమానా
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం