హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఉన్న అంజన్ పాత్ ల్యాబ్స్& అలర్జీ టెస్టింగ్ సెంటర్లలో 50 శాతం కంటే తక్కువ రేటుకే అలర్జీ రక్త పరీక్షలు నిర్వహించనున్నట్టు చర్మవ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ ప్రశాంత్ జరత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి సోమవారం (ఐదోతేదీ) వరకు రెండు రాష్ర్టాల్లోని ఆయా ల్యాబ్లలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రక్త నమూనాలు సేకరించనున్నట్టు పేర్కొన్నారు. 80-130 అలర్జీ కారకాలు (ఆహారం, చర్మం, శ్వాస, డ్రగ్ వంటి) కలిగిన వాటికి 50 శాతం కంటే ఎక్కువ రాయితీతో అలర్జీలకు పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.