హైదరాబాద్ : సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ సమాజమంతా ఉందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో ఆదర్శపాలన అందిస్తున్న ఘనత కేసీఆర్దేనని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ అంటే అమితమైన ప్రేమని, ఆయన కోరితే కచ్చితంగా ఆదరిస్తారని సాగర్ ఉప ఎన్నిక ఫలితంతో మరోసారి స్పష్టమైందని అన్నారు.
‘‘కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఈ తీర్పు చెంపపెట్టులాంటిది. తమ అభ్యర్థికి డిపాజిట్ కూడా సాధించుకోలేని బీజేపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సీఎం కేసీఆర్ను విమర్శించే ముందు తమస్థాయిని గుర్తుంచుకొని మాట్లాడాలి. అభివృద్ధికి పట్టం కట్టిన సాగర్ ప్రజలకు నా కృతజ్ఞతలు. టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఎన్నికల్లో విజయం సాధించిన నోముల భగత్కు శుభాకాంక్షలు’’ అని మంత్రి వేముల పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.