డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్
డోర్నకల్, మే 23 : ధైర్యంతో కరోనా వైరస్ను జయించాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కొవిడ్ బాధితులకు సూచించారు. ఆదివారం ఆయన కరోనా బారినపడి కోలుకున్న మున్సిపల్ చైర్మన్ వీరన్నను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తున్నదన్నారు. కరోనా బాధితులకు ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నదన్నారు. అనంతరం ఎమ్మెల్యే హూన్యతండా పంచాయతీ పరిధిలోని రాముతండా నుంచి గార్ల మండలం రాంపురం పులిగుట్టతండాకు వెళ్లే మట్టిరోడ్డును పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నున్న రమణ, మున్సిపల్ వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం, ఎంపీపీ ధరంసోత్ బాలూనాయక్, పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్, కౌన్సిలర్లు జనార్దన్, శరత్, అశోక్, సురేందర్ జైన్, పీఏసీఎస్ చైర్మన్ భిక్షంరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు లాల్మియా పాల్గొన్నారు.